మోదీపై రాహుల్ ఫైర్...!
తాజాగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారత్ బచావ్ పేరుతో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో నిత్యావసర ధరలు బాగా పెరిగిపోతున్నా, ఉల్లి కిలో రూ. 200కు చేరిన కూడా కేంద్రం మాత్రం ఏమి పట్టనట్టు ఉంది అని రాహుల్ మండిపడ్డరు. ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బ దింటుంది అని అన్నారు. ఇందుకు ముఖ్య కారణం శత్రువులు కాదు..స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వీర్యం అని ఆరోపణలు చేయడం జరిగింది.
నోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశారు అని విమర్శించడం జరిగింది. ఇలా చేసినందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా జాతికి క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేయడం జరిగింది. నల్లధనం నిర్మూలనతో అందరి జేబుల్లోని డబ్బును వెనక్కి తీసుకోవడం జరిగింది అని, ప్రజలకు కొనుగోలు శక్తి లేకుండా చేశారు అని మండిపడ్డారు. మోదీ విధానాల వల్ల ఈశాన్య రాష్ట్రాలు బాగా బగ్గుమంటూ ఉన్నాయి అని అన్నారు. మరోసారి అత్యాచార ఘటనలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను సమర్థించు కోవడం జరిగింది.
ఇక సోనియా గాంధీ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి అని తెలిపారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు సరిగా లేవు అని, రైతులకు గిట్టుబాటు ధరలు అందట్లేవన్నారు అసలు లేవు అని అన్నారు. ఇక తాజాగా పౌరసత్వ సవరణ చట్టం వల్ల భారతీయ ఆత్మ ముక్కలు ముక్కలు అవుతున్న కూడా ఏ మాత్రం మోదీ-షా పట్టించుకోవట్లేదని సోనియా గాంధీ విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ నేతలు దేశ ఆర్థిక శోభ నుంచి సంరక్షించుకోవాలి అని పిలుపు నివ్వడం జరిగింది.