అమెరికాలో దారుణం.. హైదరాబాద్‌ యువతిపై అత్యాచారం..!

Suma Kallamadi

ప్రస్తుతం మన ప్రపంచంలో యువతిపై దాడులు, అత్యాచారలు  బాగా పెరిగి పోయాయి. తాజాగా హైదరాబాద్‌ కుటుంబానికి చెందిన యువతి అమెరికాలోని చికాగోలో అత్యాచారం  చేసి హతమార్చాడు ఓ దుండగుడు అని సమాచారం. రూత్‌ జార్జ్‌ (19) అనే యువతి మాట్లాడేందుకు నిరాకరించడంతో డొనాల్డ్‌ తుర్మాన్‌ చంపేశాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. పిలిస్తే పట్టించుకోలేదని, మాట్లాడేందుకు నిరాకరించడని కోపంతోనే గొంతు నులిమి హత్య చేశాడని స్వయంగా డొనాల్డ్‌ తుర్మాన్‌  ఒప్పు కోవడం జరిగింది. తాజాగా ఈ సంఘటనపై   తుర్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కూడా నిర్వహించడం జరిగింది.

 

ఇక కుక్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌ జేమ్స్‌ మర్ఫీ మాట్లాడుతూ.. నిందితుడు నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలియచేయడం జరిగింది. ఈ సంఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే  రూత్ జార్జ్‌  యూనివర్సిటీ క్యాంపస్‌ పార్కుకు నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో తుర్మన్‌ వెనుక నుంచి పిలవడం జరిగింది. పట్టించుకోకుండా కారు గ్యారేజీలోకి వెళ్తుండటం గమనించి ఆమెను వెంబడించడం జరిగింది.

 

తుర్మన్‌  ఆగ్రహానికి గురై ఆమె గొంతు నులిమానని అచేతనా స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెపై అత్యాచారం జరిపానని  ఒప్పు కోవడం జరిగింది. ఆమె చాలా అందంగా ఉందని, తనతో మాట్లాడాలని భావించాను అని చెప్పుకొని వచ్చాడు తుర్మన్‌. ఇక తుర్మన్‌కు బెయిల్‌ ఇవ్వ కూడదు అని, కస్టడీలోకి తీసుకోవాలని వాదనలు విన్న జడ్జి చార్లెస్‌ బీచ్‌–2 ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. 

 

గతంలో కూడా తుర్మన్‌  ఆయుధాల దొంగతనం కేసులో ఆరేళ్లు జైలు శిక్షకు గురైన రెండేళ్లు జైలులో ఉండి గత సంవత్సరం డిసెంబర్‌లో బెయిల్‌పై బయటికి రావడం జరిగింది. ఇక రూత్‌జార్జ్‌ షికాగోలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌లో ఆనర్స్‌ రెండో సంవత్సరం చదువు కొనసాగిస్తుంది. హైదరాబాద్‌కు చెందిన ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఈ సంఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: