విద్యార్థులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పదవతరగతి ఫలితాలు బుధవారం విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది తెలంగాణ ఎగ్జామినేషన్ బోర్డు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30 వరకు SSC పరీక్షలు నిర్వహించారు.
5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను www.bsetelangana.org, https://results.cgg.gov.in లలో లాగిన్ అయి చూడొచ్చు.
ఈ ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారని సంబంధిత అధికారులు తెలిపారు.