జనసేనలోకి రావాలంటే ఆ సీటును డిమాండ్ చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ ?

VAMSI
ఏపీ రాజకీయాలలో వచ్చే ఎన్నికలను దృష్ట్యా త్వరితగతిన మార్పులు ? పార్టీలపై ప్రజల అభిప్రాయాలు ? గెలుపు ఓటములపై అంచనాలు మారిపోతున్నాయి. 2024 లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇంకా ఏడాదకిపైగానే సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేశాయి. ఇదిలా ఉంటే వైసీపీ ఎప్పటిలాగే ఒంటరిగా ఈ ఎన్నికలకు వెళ్లనుంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ మాత్రమే జనసేనతో కలిసి ఎన్నికలలో వైసీపీని ఢీ కొట్టనుంది. ఇప్పటికే సీట్ల విషయం , ఏ క్షణంలో ఎవరు పోటీ చెయ్యాలి అన్న వాటి గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి.
కాగా గత కొంతకాలంగా వినిపిస్తున్న ఒక విషయం గురించి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ లో ఉన్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మి నారాయణ అధ్యక్షుడుగా చేసి మళ్ళీ అధిష్టానం అసంతృప్తి చెందడంతో అతని స్థానంలో సోము వీర్రాజును నియమించారు. అప్పటి నుండి కన్నా పార్టీలో ఉండాలా వద్ద అన్న సందేహంలోనే ఉన్నారు. కానీ ఈమధ్య నుండి ప్రజలలో కాస్తో కూస్తో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు మైలేజ్ రావడంతో ఇప్పుడు ఆయన కన్ను జనసేపై పడింది. ఇక పవన్ కూడా సీనియర్ నాయకులు పార్టీలో ఉండడం మంచిదని భావించి ఆయనను పార్టీలోకి రమ్మని అడిగారు.
కానీ కన్నా మాత్రం పవన్ ముందు ఒక డిమాండ్ ఉంచారట. నేను జనసేనలోకి రావడానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ నాకు సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ కావాలి అని తెలియచేశారట. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా ఉన్నారు. ఇద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పోటీ ఇక్కడ బలంగా ఉండనుంది. అంత అనుకున్నట్లు జరిగితే మరో రెండు రోజుల్లో కన్నా జనసేన తీర్థం పుచ్చుకుంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: