తెలంగాణ: ప్రధాని పర్యటన ఖరారు?

Purushottham Vinay
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన కన్ఫర్మ్ అయ్యింది. ఈనెల 19 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానున్నారు.ఇంకా ఈ నేపథ్యంలో పెరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభని ఏర్పాటు చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. సికింద్రబాద్‌లోని ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంకా ఎంపీ అయిన బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పరిశీలించడం జరిగింది. ప్రధాన మంత్రి రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించారు. ఇందులో భాగంగా.. సోమవారం నాడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను సందర్శించి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమవ్వడం జరిగింది.ప్రధాన మంత్రి పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును స్టార్ట్ చెయ్యనున్నారు ప్రధాని మోడీ. ఆ తరువాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకి కూడా శంకుస్థాపన చేస్తారు. ఇంకా అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఓవరాలింగ్ వర్క్ షాప్ కు కూడా శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోడీ.


వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ దాకా తిరగనుంది. ఈనెల 19 వ తేదీన మొత్తం రూ.2400 కోట్ల బడ్జెట్ తో రైల్వేకు సంబంధించి వివిధ అభివృద్ది పనులను ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టనున్నారు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బండి సంజయ్ ఇంకా లక్ష్మణ్ లకు వివరించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ప్రధాన మంత్రి రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బండి సంజయ్ ఇంకా లక్ష్మణ్ రైల్వే అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆ తరువాత బండి సంజయ్‌తో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని పర్యటన కార్యక్రమాలకు వివరించడం జరిగింది.ఇక తెలంగాణ ప్రయోజనాలకు ప్రధాని మోదీ పెద్ద పీట వేస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే మొత్తం రూ.1.04 లక్ష కోట్ల వ్యయంతో తెలంగాణలోని జాతీయ రహదారులను నిర్మాణాన్ని కేంద్రం చేపట్టిందని చెప్పారు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానానికి చేరుకుందని కూడా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: