పోస్టాఫీసు అదిరిపోయే స్కీమ్..రూ.7 లక్షలు ఆదాయం పొందే అవకాశం..

Satvika
పోస్టాఫీస్ లో ఎన్నో రకాల స్కీమ్ లు అందుబాటు లో ఉన్నాయి.. అందులో కొన్ని మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. దాంతో ఎక్కువ మంది ఇలాంటి వాటిలో పొదుపు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరు వివాహం చేసుకున్నట్లయితే పోస్టాఫీసు నుంచి రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. ప్రభుత్వ పథకాలు పోస్టాఫీసు నిర్వహిస్తోంది. అందులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడిని పొందవచ్చు. అయితే ఇందులో ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. మెచ్యూరిటీ తర్వాత ప్రతి త్రైమాసికం లో వడ్డీ డబ్బు అందుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

సీనియర్‌ సిటిజన్‌ స్కీం లో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.7.21 లక్షలు లభిస్తాయి. అందులో రూ.2.21 లక్షలు వడ్డీగా అందుతాయి. ఈ పథకం పై అక్టోబర్ 1, 2022 నుంచి ప్రభుత్వం 7.6 శాతం చొప్పున చక్రవడ్డీ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ప్రతి మూడు నెలలకి రూ. 11058 వడ్డీగా పొందుతారు. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి ఈ ఖాతాను తెరవవచ్చు..

55 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కానీ లేదా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు VRS తీసుకున్నట్లయితే అతను SCSS లో ఖాతా ను తెరవవచ్చు. భార్యా భర్తలు ఇద్దరు కలిసి ఈ ఖాతా ను తెరవవచ్చు. అయితే దీని కోసం మీరు గరిష్టంగా 15 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మెచ్యూరిటీకి ముందు ఈ ఖాతా ను క్లోజ్‌ చేస్తే కొంత మొత్తాన్ని ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ అయిన వారికి ఇది సురక్షితమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ పథకం లో డబ్బుల ను ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల మంచి బెనిఫిట్స్ పొందొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: