పాలేరు నియోజకవర్గ బాధలు తీరుస్తా : వైఎస్ షర్మిల

Purushottham Vinay
వై. యస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను ఇక నుంచి పాలేరు బిడ్డ అని వైఎస్ షర్మిల గారు అన్నారు. పాలేరు మట్టి సాక్షిగా నేను చెబుతున్నా.. పాలేరు ప్రజల ప్రతీ కష్టంలో, ప్రతీ బాధలో కూడా నేను తోడుంటానని చెప్పారు.పాలేరు ప్రజల హక్కుల కోసం..పాలేరు అభివృద్ధి కోసం కొట్లాడుతానని తను స్పష్టం చేశారు. పాలేరు ప్రజల బంధువునవుతా..బలమైతా..బిడ్డనవుతానని కూడా షర్మిల తెలిపారు. గడపగడపకు కూడా  రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను తెచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలన్న తపన బాగా ఉందన్నారు. సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ షర్మిల గారు అన్నారు. విద్యార్థులకు, వృద్ధులకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో మందికి ఉచిత వైద్యం అందించారని కూడా చెప్పారు. 5 ఏళ్ల పాటు..46 లక్షల పేదకుటుంబాలకు ఇండ్లు కట్టించారని తెలిపారు. అసైన్డ్ భూములకు హక్కులు, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించారని ఆమె తెలిపారు. 


పాలేరు నియోజకవర్గంలో పాలేరు రిజర్వాయర్కు మరమ్మతులు కూడా చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అని షర్మిల వెల్లడించారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్ నింపి.. 2 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చారని ఆమె తెలిపారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరిచ్చారని గుర్తు చేశారు. పాలేరు నియోజకవర్గానికి పరిశుద్ధ నీళ్ల పథకం ద్వారా మంచినీరు ఇచ్చారని చెప్పారు. పాలేరులో 20 వేల మంది పేద కుటుంబాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇండ్లు కూడా కట్టించారన్నారు. పాలేరు నియోజకవర్గంలో కేసీఆర్ ఎన్ని ఎకరాలకు సాగునీరిచ్చారు. ఎన్ని ఇండ్లు కట్టించారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో మళ్లీ రాజశేఖర్ రెడ్డి పాలన రావాలని వైఎస్ షర్మిల అయితే ఆకాంక్షించారు. పాలేరులో ప్రతీ ఒక్కరికి కూడా పక్కా ఇళ్లు కట్టే ప్రభుత్వం రావాలి..ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అమలు చేసే ప్రభుత్వం రావాలి. ఇంట్లో ఎంత మంది వున్నా అందరికి పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం అయితే రావాలన్నారు. ఇవన్నీ జరగాలంటే రాజశేఖర్ రెడ్డి పాలన రావాలన్నారు. అందుకే తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించానని ఆమె  స్పష్టం చేశారు. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: