కస్టమర్లకు గుడ్ న్యూస్..యూపీఐ లో కొత్త ఫీచర్‌..

Satvika
ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది.. అందుకు తగ్గట్లుగా ప్రత్యేకమైన యాప్ లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.. అందులో ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్‌..లావాదేవీలు జరిపే పని మరింతగా సులభంగా మారిపోయింది. యూపీఐ లావాదేవీలు జోరుగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు యూపీఐని ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్నారు.రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిసెంబర్‌ మానిటరీ పాలసీ సమీక్షను బుధవారం నిర్వహించింది. దీంతో త్వరలో యూపీఐ పేమెంట్‌ సిస్టమ్‌లో సింగిల్‌ బ్లాక్‌, మల్టిపుల్‌ డెబిట్‌ వంటి ఫీచర్‌ను యాడ్‌ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ప్రస్తుతం మీరు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో షాపింగ్ చేయడం లేదా షేర్లను కొనుగోలు చేయడం, విక్రయించడం కోసం యూపీఐలో సింగిల్ బ్లాక్, సింగిల్ డెబిట్’ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నారు. దీనితో మీరు ఈ సేవలకు ఆటోపే సదుపాయాన్ని పొందుతారు. అంటే చెల్లింపు స్వయంగా పూర్తవుతుంది. ఇప్పుడు ఈ సేవ పరిధిని పెంచబోతోంది..

సింగిల్-బ్లాక్-అండ్-మల్టిపుల్-డెబిట్ ఫీచర్‌తో ఇప్పుడు అనేక రకాల లావాదేవీల కోసం యూపీఐ ద్వారా మీరు మీ ఖాతాలోని మొత్తాన్ని ఒకేసారి బ్లాక్ చేసి, తర్వాత వేరు చేయవచ్చు. ప్రత్యేక చెల్లింపుతో తగ్గింపు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అంటే, కస్టమర్ అవసరమైనప్పుడు డబ్బును తీసివేయడం కోసం వారి బ్యాంక్ ఖాతాలలో ఒకేసారి నిధులను బ్లాక్ చేయడం ద్వారా సంబంధిత ఎంటిటీకి చెల్లింపును పరిష్కరించవచ్చు. ఈ విధానంతో ఈ-కామర్స్, షేర్ మార్కెట్‌లో పెట్టుబడికి చెల్లింపు చాలా సులభతరం అవుతున్నాయి. యూపీఐ సింగిల్ బ్లాక్, సింగిల్ డెబిట్ ఫీచర్ ద్వారా ప్రతి నెలా 70 లక్షలకు పైగా ఆటో చెల్లింపులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేస్తామని ఆర్‌బీఐ చెబుతోంది. అదే సమయంలో, భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ పరిధిని కూడా పెంచుతారు.. దీంతొ బిల్లు చెల్లింపులు, మొదలగు చెల్లింపులు చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: