సుప్రీం షాకింగ్ తీర్పు.. రేప్ కేసులో నిందితులకు ఉరిశిక్ష రద్దు?

Purushottham Vinay
మన దేశంలో వెయ్యి మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ , ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనేది మన భారత దేశం యొక్క న్యాయవ్యవస్థ నినాదం. అంటే, ఒక్క నిర్దోషి కూడా అన్యాయంగా ఇంకా అలాగే అసలు ఏ విధంగా కూడా బాధింపకూడదు అనేదే మన విధానం.మన భారత దేశ న్యాయవ్యవస్థ ప్రాథమిక సూత్రాన్ని మరోసారి గుర్తుచేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. పదేళ్లక్రితం దేశ రాజధానిలో సెన్షేషన్‌ సృష్టించిన చావ్లా గ్యాంగ్‌ రేప్‌ అండ్ మర్డర్‌ కేసులో సంచలన తీర్పును ఇవ్వడం జరిగింది. ఏకంగా ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పైగా ఆ ముగ్గురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది మన సర్వోన్నత న్యాయస్థానం.సరిగ్గా 2012 వ సంవత్సరంలో 19ఏళ్ల యువతి గ్యాంగ్‌ రేప్‌ అండ్ మర్డర్‌కి గురైంది.ఆమెను సామూహిక అత్యాచారంచేసి అత్యంత పాశవికంగా చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు కామాంధులు. ఉత్తరాఖండ్‌కి చెందిన రవికుమార్‌, రాహుల్‌ ఇంకా వినోద్‌ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేల్చారు పోలీసులు.


అయితే ఈ కేసులో ముగ్గురినీ దోషులుగా తేల్చిన ట్రయల్‌ కోర్ట్.. 2014 వ సంవత్సరంలో మరణశిక్ష విధించింది.ఇక ఆ తీర్పును సవాలు చేయడంతో ఢిల్లీ హైకోర్టు కూడా ట్రయల్‌ కోర్టు జడ్జిమెంట్‌నే సమర్ధించడం జరిగింది. దాంతో, దోషులు… సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది.ఇక ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును కూడా ఇవ్వడం జరిగింది.ఆ ఉరిశిక్షను రద్దు చేయడమే కాకుండా ముగ్గురు దోషులను కూడా నిర్దోషులుగా ప్రకటించింది. అయితే,ఈ సుప్రీం కోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తంచేసింది బాధిత కుటుంబం.న్యాయపోరాటం అనేది కొనసాగిస్తామని తెలిపింది.ఇక సోషల్ మీడియాలో కూడా దీనిపై పూర్తి వ్యతిరేకత అనేది నడుస్తుంది. ఈ కేసులో వారిని నిర్దోషులుగా ప్రకటించినప్పుడు అసలు దోషులు ఎవరో కనిపెట్టి వారికి తగిన శిక్ష విధించండి. అసలు మన దేశంలో చట్టం ఇలా ఉండబట్టే అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు చాలా ఎక్కువవుతున్నాయని చట్టం మంచిది కాదని పలువురు నెటిజన్స్ మన న్యాయస్థానాలపై తెగ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: