మరో మూడు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు..

Satvika
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. వాటితో ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అందరికి తెలుసు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాల గురించి కూడా తెలుసు.భారీగా కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాలు ఇంకా నీట మునిగాయి.. ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు మరో బాంబ్ ను పేల్చారు.. బంగాళాఖాతము మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణ స్థాయిలలో ఈశాన్య గాలులు ఏర్పడ్డాయి. దీంతో బెంగాల్, దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని పరిసర ప్రాంతాలలో ఈశాన్య రుతుపవనాల ప్రభావముతో అక్టోబర్ 29వ తేదీ నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి..

నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక పై గల వాయుగుండం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
 

తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.. ప్రజలు చాలా జాగ్రత్తగా వుండాలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: