2024 ఎన్నికల్లో వైసీపీ ప్రధాన అజెండా... !
అయితే ఒకవైపు నవరత్నాలు తనను మళ్ళీ గెలిపిస్తాయని నమ్మకారంతో ఉన్నా, మరోవైపు భయంగానే ఉన్నాడు. కాగా ఈసారి ఎన్నికల మానిఫెస్టోగా రాష్ట్ర రాజధాని విషయాన్ని ప్రజల ముందుకు తీసుకె వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. మొదటి నుండి మూడు రాజధానుల విషయం మీద గట్టిగా ఉన్నాడు. కానీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం దీనిని తిప్పి కొట్టడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఇప్పటికే రాజధానిగా ఉన్న అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. అయితే ఈ విషయాన్ని టీడీపీ ఎన్నికల్లో వాడుకోవడానికి ఎంతమాత్రం ఉపయోగపడదని తెలుస్తోంది.
కానీ ఇప్పటికీ మూడు రాజధానులను ప్రకటించిన తర్వాత జరిగిన తిరుపతి ఎంపీ మరియు ఆత్మకూరు ఎమ్మెల్యే అప్ ఎన్నికల్లో విజయ కేతనాన్ని ఎగురవేసింది వైసీపీ. దీనితో మూడు రాజధానులు ప్రజల సపోర్ట్ దొరికినట్లేనని వైసీపీ అంటోంది. కానీ ఈ అంశం ఏపీ ప్రజలకు సంబంధించి చాలా ముఖ్యమైంది. కాబట్టి పూర్తి ప్లానింగ్ తోనే ప్రజల ముందుకు వెళ్లడం మంచిదన్నది ప్రముఖులు అభిప్రాయం. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ అంశం ఎంత వరకు కీలకం అవుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము.