'ఆత్మకూరు ఉప ఎన్నిక' విజయమే గౌతమ్ రెడ్డికి సరైన నివాళి !
ఒకవేళ టీడీపీ పోటీలో ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆశ్చర్యకరంగా టీడీపీ పోటీ చేయకపోవడంతో వైసీపీకి విజయం తధ్యమేనన్న మాటే వినిపిస్తోంది. కానీ ప్రజలు ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారు అన్నది ఎవరూ ఊహించలేము. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆత్మకూరు ఎన్నికలో గెలవడానికి వైసీపీ అధిష్టానం మంత్రులను అక్కడే మోహరించింది. అయితే వీరు ప్రచారానికి వెళుతున్నా ప్రజల నుండి అంతగా స్పందన రావడం లేదన్నది పబ్లిక్ టాక్. మరి ఇక్కడి ప్రజలు వైసీపీకి బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారా ? అన్నది ఒక ప్రశ్న. ఈ ఎన్నిక కోసం మొత్తం స్వతంత్ర్య అభ్యర్థులను కలుపుకుని 14 మంది పోటీలు ఉన్నారు .
ఈ ఎన్నికను చనిపోయిన గౌతమ్ రెడ్డికి ఒక నివాళిగా ఇవ్వాలని పార్టీ కష్టపడుతోంది. మరి ఈ నియోజకవర్గ ప్రజలు గౌతమ్ రెడ్డి ఆత్మకు అఖండ మెజారిటీతో గెలిపించి తన ఆత్మకు శాంతి చేకూరుస్తారా అన్నది వేచి చూడాలి.