వావ్.. ఎవరెస్టుని అధిరోహించిన తెలంగాణ యువతి!

Purushottham Vinay
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri bhuvanagiri District) భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన యువతి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించింది.ఈ మధ్య పర్వతారోహకురాలు 24 ఏళ్ల పడమటి అన్విత రెడ్డి (Anita) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. దీంతో అన్వితపై సర్వత్రాకూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఎంపీ బూర నర్సింగ్ గౌడ్ పడమటి అన్వితఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు ఇంకా దేశ, విదేశాలోని ఎంతో మంది మహిళలకు ఎంతో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అన్విత భువనగిరికి చెందిన యువతి అయినందుకు మనం గర్విద్దామని ఆయన అన్నారు. కష్టాలను అధిగమించి శిఖరాన్ని అధిరోహించిన అన్వితకు, తన గురువులకు ఇంకా తనను ఇంతగా ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు ఎంపీ బూర నర్సింగ్ గౌడ్ అభినందనలు తెలియజేశారు.


ఇక తెలంగాణ యువతి పడమటి అన్విత రెడ్డి 29,112 అడుగుల (8,848.86 మీటర్లు) ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించింది. ఏప్రిల్‌ 10 వ తేదీన భువనగిరి నుంచి బయల్దేరిన ఆమె 12న నేపాల్‌కు చేకుంది.ఇక నేపాల్ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్న ఆమె అక్కడి శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణను పొందింది. ఈ నెల 9వ తేదీన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం స్టార్ట్ చేసింది. ఇక ఈ నెల 16 సోమవారం నాడు ఉదయం 9:30 గంటలకు ఎవరెస్ట్‌ శిఖరానికి చేరుకొని తన లక్ష్యాన్ని ఆమె నెరవేర్చుకుంది. అక్కడ జాతీయ జెండాతో పాటు భువనగిరి ఖిల్లా, ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ ఇంకా అలాగే స్పాన్సర్స్‌ ఫ్లెక్సీలను సగర్వంగా ప్రదర్శించింది. తిరిగి ఈనెల 18 వ తేదీన బుధవారం నాడు ఎవరెస్టు కింద ఉండే బేస్‌ క్యాంపుకు చేరుకున్నది. దీంతో అన్విత నేపాల్‌ మార్గంలో శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. భువనగిరి ఖిల్లాపై పర్వతారోహణలో ఆమె ప్రాథమిక శిక్షణని పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: