వైసీపీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ?

Veldandi Saikiran
అమరావతి : టీడీపీ కార్యాలయంలో రెండో రోజు సర్పంచుల అవగాహన సదస్సు నిరహించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం సర్పంచులకు ఈ సందర్భంగా  కీలక సూచనలు చేసేసింది.  చెత్త పన్ను కు వ్యతి రేకంగా పంచాయతీల్లో తీర్మానం చేయాలని చంద్రబాబు  సూచనలు చేసినట్లు సమాచారం అందుతోంది. చెత్త పన్నును వసూలు చేసేదే లేదని పంచాయతీల్లో తీర్మానం చేయాలన్నారు చంద్రబాబు. తెలుగుదేశం సర్పంచులున్న ప్రతి చోట చెత్త పన్నుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలన్నారు చంద్రబాబు.  గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని.. పేర్కొన్నారు చంద్రబాబు. ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు ఇవ్వకుంటే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలి.. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు చంద్రబాబు.  తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడైన బాబాయిను చంపి.. టీడీపీ మీద విమర్శలు చేశారని వెల్లడించారు చంద్రబాబు. దొంగలను పట్టుకున్న సీబీఐది తప్పంటారా..? అని ప్రశ్నించారు చంద్రబాబు. ఎంపీ అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని వైఎస్ వివేకా అన్నందుకు కక్ష కట్టారన్నారు చంద్రబాబు.  పరిటాల రవి హంతకులను ఒక్కొక్కర్ని చంపేశారన్నారు చంద్రబాబు. 

రాష్ట్ర ముఖ్యమంత్రే నేరాలు.. ఘోరాలు చేస్తూ హత్య రాజకీయాలు చేస్తే ఎలా..? అని నిలదీశారు చంద్రబాబు.  సర్పంచులను సీఎం జగన్ ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారని.. గ్రామాల్లో సర్పంచులను కాదని ఒక్క పని చేయడానికైనా వీల్లేదన్నారు చంద్రబాబు. గ్రామాల్లో సర్పంచులే సుప్రీం అని.. టీడీపీ సర్పంచులు పట్టుదలతో వ్యవహరిస్తే వైసీపీ సర్పంచుల నుంచే మద్దతు లభిస్తుందన్నారు చంద్రబాబు. గ్రామాల్లో టీడీపీ హయాంలో కట్టించిన భవనాలకు రంగులేసుకోవడంతోనే వైసీపీ పాలన సరిపోతోందన్నారు చంద్రబాబు.  రూ. 7 వేల కోట్లకు పైగా నిధులు ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి వచ్చాయన్నారు చంద్రబాబు. గ్రామ పంచాయతీ కార్యాలయాల ఖాతాలకు చేరాల్సిన నిధులను ప్రభుత్వం తీసేసుకుందన్నారు చంద్రబాబు.
గ్రామాల్లో పేదలకిచ్చిన ఇంటి జాగా నివాస యోగ్యంగా ఉన్నాయా..? అని అన్నారు చంద్రబాబు.  ఇళ్ల స్థలాల సేకరణలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: