అస్సాం సీఎంపై క్రిమినల్ కేసులు... కాంగ్రెస్ ధర్నాలు
అయితే ఈ వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు అస్సాం సీఎం పై మండి పడుతున్నారు. ఇదే విషయంపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేశారు. అయితే వెంటనే ఆ ఫిర్యాదును అంగీకరించి కేసును నమోదు చేసుకున్నారు. ఇదే విధంగా మిగిలిన పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆందోళనలు చేప్పట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈ రోజు ఎస్పీ మరియు కమిషనేర్ ఆఫీసుల ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవడంలేదో సమాధానం చెప్పాలని నిరసనలు చేపట్టారు.
ఈ ధర్నాలో రేవంత్ రెడ్డి మరియు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు అందరూ భాగం కానున్నారు. తెలంగాణాలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా ఇన్వాల్వ్ అయిందా అన్న విషయంపై కూడా కాంగ్రెస్ ఆలోచిస్తోంది. నిన్ననే రేవంత్ రెడ్డి కేసీఆర్ మోదీకి కట్టుబడే పనిచేస్తున్నాడని వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అదే నిజమా అని అందరికీ తెలుస్తోంది. మరి ఈ విషయం ఎంత దూరం వెళుతుందో తెలియాల్సి ఉంది.