జగన్ "యు టర్న్" తీసుకుంటున్నాడా? దృష్టి మరలుతోందా?
అయితే పట్టాభి కనుక ఎప్పటి లాగే సంయమనంతో స్ట్రెయిట్ గా పాయింట్ మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదు. ఇక్కడ ఎవ్వరైనా సమస్యను వదిలేసి డైరెక్ట్ గా మాటల దాడి ఒక వ్యక్తిపై చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది అంతా ఆలోచించుకోవాలి. ఈ వ్యాఖ్యలు చేసే ముందు తమ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కు చెప్పారా? చంద్రబాబు తెలిసే ఊరికే ఉన్నారా? అనేది వారికే తెలియాలి. అయితే ఈ మాటలు విన్న చూసిన వైసిపి అభిమానులు, జగన్ అభిమానులు తట్టుకోలేక ఇలా టీడీపీ కార్యాలయాల పైన దాడులు చేశారని అంతా అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో ఇంకా తెలియలేదు. సీఎం జగన్ సైతం ఈ విషయంపై అభిమానుల స్పందన అని మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇదంతా వచ్చే ఎన్నికల్లో ఎవరిమీద ప్రభావం చూపిస్తుంది అనే విషయం మరిచినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ విధమైన దాడులు సమర్ధించదగినవి కావు. జగన్ ప్రభుత్వం దృష్టి మారుతున్నట్లు అనిపిస్తోంది. ప్రజలపై మరియు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఇలాగే కొనసాగితే సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ ఇవన్నీ ఆలోచించి రానున్న రోజుల్లో అభివృద్ధి కోసం పాటుపడతారా అన్నది తెలియాల్సి ఉంది.