2 గంటల ట్రైన్ లేట్... రూ. 4 లక్షల పరిహారం...?

Sahithya
మన దేశంలో ట్రైన్ ప్రయాణం ఇప్పుడు ఆలస్యం కావడం పట్ల ప్రయాణికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపధ్యంలో ప్రయాణికులకు పరిహారం చెల్లించడం జరుగుతుంది. మన దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు, తేజస్ ఎక్స్‌ప్రెస్ శనివారం-ఆదివారం మూడు ట్రిప్పుల్లో 2.5 గంటలు ఆలస్యమైన కారణంగా ఐఆర్‌సిటిసి గరిష్టంగా 2035 మంది ప్రయాణికులకు రూ. 4.5 లక్షలు చెల్లిస్తుంది. శనివారం భారీ వర్షం తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్ వైఫల్యం కారణంగా తేజస్ దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చింది.
ఆదివారం కూడా లక్నో-ఢిల్లీ రైలు సుమారు గంటపాటు ఆలస్యమైంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలు. ఈ ట్రైన్ ఆలస్యం అయితే మాత్రం ప్రయాణికులకు కచ్చితంగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. రైలు ఒక గంట ఆలస్యమైతే రూ .100, రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యానికి రూ .250 పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ నడుపుతున్న ఐఆర్‌సిటిసి, ప్రతి వ్యక్తికి 250 రూపాయల చొప్పున చెల్లిస్తుంది.  శనివారం రెండు ట్రిప్పులలో తేజస్ 1574 మంది ప్రయాణీకులు వెళ్ళారు.
మొత్తం మూడు లక్షల 93,500 రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆదివారం మొదటి రౌండ్‌లో 561 మంది ప్రయాణీకులకు 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గంట ఆలస్యం అయింది. ఫ్లైట్ లాంటి సదుపాయాలతో, తేజస్ ఎక్స్‌ప్రెస్ మొదటిసారి 4 ఆగస్టు 2019 న లక్నో మరియు ఢిల్లీ మధ్య నడిచింది. ఇప్పటివరకు ఒక గంట కంటే తక్కువ ఆలస్యానికి కేవలం ఐదు సార్లు మాత్రమే ఫిర్యాదులు వచ్చాయి. ఈ రైలు 99.9 శాతం ఆలస్యం చేయలేదని ఐఆర్‌సిటిసి ప్రకటించింది. గత శీతాకాలంలో పొగమంచు కారణంగా తేజస్ ఒకసారి రెండు గంటలు ఆలస్యమైంది. రైలు ఆలస్యమైతే ఐఆర్‌సిటిసి ఇంత భారీ మొత్తాన్ని చెల్లించాల్సి రావడం గత రెండేళ్ళలో ఇదే మొదటిసారి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: