పాపం కేంద్ర మంత్రులు... ఎందుకు ఇలా...?
గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్ధిక సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రాలకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. కేంద్ర మంత్రులు సొంత రాష్ట్రంలో కూడా కనీసం తమ సొంత నియోజకవర్గానికి కూడా డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అనే విషయం కూడా చెప్పవచ్చు. ఇద్దరు ముగ్గురు కేంద్రమంత్రులు మినహా మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అసలు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలియదు. దేశంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నా సరే ఆమె మాట్లాడటం లేదు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావడం లేదు. గత ఏడాది మన దేశంలోకి కరోనా అడుగు పెట్టిన సమయంలో వీళ్ళందరూ కూడా ఎక్కువగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. దీంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. ప్రధానమంత్రి మోడీ తీరుపై మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది