ఎయిర్ పోర్ట్ లో దొంగతనం.. చేసింది ఎవరో కాదండోయ్?

praveen
సాదరణంగా రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులు  ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఏమాత్రం ఏమరూపాటుగా ఉన్నా ఇక దొంగలు చేతివాటం చూపించి అందిన కాడికి దోచుకుపోతారు అని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే రైళ్లలో ఏకంగా ప్రయాణికుల వద్ద దొంగతనాలు జరిగిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక అచ్చం సినిమాల్లో చూపించిన విధంగానే తోటిప్రయాణికుల లాగా కూర్చుని ఇక మంచి వాళ్ళలా నటించి భారీగా డబ్బులు దోచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే రైళ్లలో ఇలాంటి దొంగతనాలు కామన్ కానీ అటు విమానాలలో ఇలాంటి చోరీలు జరుగుతాయా అంటే ఊరుకోండి బాసూ హై సెక్యూరిటీ మధ్య విమాన ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఏర్పోర్టులోకి అడుగు పెట్టింది మొదలు విమానం ఎక్కి దిగే వరకు కూడా ఎక్కడ ఇలాంటి చోరీలకు సంబంధించిన ఘటనలు జరిగేందుకు అవకాశం ఉండదు. ఆ రేంజ్ లో సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా విమానాలలో ఎందుకు దొంగతనాలు జరుగుతాయి అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ విమానాశ్రయంలో కూడా దొంగతనం జరిగింది  అయితే చేసింది ఎవరో కాదు ఏకంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన సిబ్బంది.

 ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది. అమెరికాలోని మయామి విమానాశ్రయంలో ఇలా సిబ్బంది చేతివాటం చూపించారు  విమాన ప్రయాణికుల బ్యాగులు తనిఖి చేస్తున్న సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది ఏకంగా బ్యాగుల్లో ఉన్న డబ్బును చోరీ చేశారు. ఇదంతా అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది  అయితే చోరీకి పాల్పడిన ఇద్దరిని  పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఇద్దరు సిబ్బంది ఒక మహిళ ముఠాగా ఏర్పడి ప్రయాణికులు బ్యాగుల్లోని డబ్బులు ఇతర వస్తువులను చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే ప్రతిరోజు సుమారు 600 నుంచి 1000 వరకు అమెరికా డాలర్లను దోచుకుంటున్నట్లు అంగీకరించారు నిందితులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: