పీకల్లోతు కష్టాల్లో పాకిస్తాన్.. అద్దెకు కరాచీ పోర్టు?

praveen
పాకిస్తాన్ ను అటు ప్రపంచ దేశాలు ఉగ్ర దేశంగా భావిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక్క చైనా సిరియా లాంటి దేశాలు తప్ప ఏ దేశం కూడా పాకిస్తాన్ తో సంబంధాలు కొనసాగించేందుకు పెద్దగా ఆసక్తి చూపదు. అయితే ఇలా ప్రపంచ దేశాలు వేలెత్తి చూపుతున్న కూడా పాకిస్తాన్ తమ తీరును మార్చుకోకుండా ముందుకు సాగుతుంది అని చెప్పాలి. ఉగ్రవాదులకు కొమ్ముకాస్తూ చివరికి దేశాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటుంది. అయితే పాకిస్తాన్ లో ఎన్ని ప్రభుత్వాలు మారిన ఇక అక్కడ వైఖరి మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే ఇలాంటి వైఖరి చివరికి పాకిస్తాన్ ను పీకల్లోతు కష్టాల్లో ముంచేసింది. పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.



పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం నేపద్యంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి అక్కడ ప్రజల పరిస్థితి దీనంగా మారిపోయింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కనీసం అక్కడ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించడం మానేసి ఇక చివరికి ప్రభుత్వ భవనాలను సైతం అద్దెకిచ్చి వచ్చిన డబ్బులతో ఇక ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న దుస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇలా  ఒక్కొక్కటిగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు మొత్తం చివరికి అద్దెకు ఇస్తూ వస్తుంది అక్కడి ప్రభుత్వం.



 ఇక ఇటీవల  మరో ప్రభుత్వ ఆస్తిని సైతం అద్దకు ఇచ్చేందుకు సిద్ధమైంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పటికే విదేశాల్లో ఉన్న చరాస్తులను  అమ్మడం అద్దకి ఇవ్వడం చేస్తున్న ప్రభుత్వం.. ఇటీవల పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న ప్రధాన ఓడరేవును యూఏఈకి చెందిన ఏ డి పోర్ట్ గ్రూప్ కి అద్దెకు ఇచ్చింది. 50 ఏళ్ల పాటు కరాచీ పోర్ట్ నిర్వహణ బాధ్యతలను ఏడి గ్రూప్ పోర్టు చూసుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇలా ఏడి గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నందుకు గాను ఇక 220 మిలియన్ల డాలర్లు పాకిస్తాన్ కు దక్కబోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: