తాలిబన్లు వచ్చాక.. ఎంతమంది ఉపాధి కోల్పోయారో తెలుసా?

praveen
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఎంతటి అరాచక పాలన సాగుతూ ఉందో అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ ప్రజానీకానికి మొత్తం ఇక అక్కడ జరుగుతున్న దారుణమైన పాలన గురించి తెలుసు అని చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య బద్ధంగా అక్కడ పాలన జరుగుతూ ఉండేది. కానీ తాలిబన్లు  ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి చివరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అన్న విషయం తెలిసిందే. తమకు అనుకూలంగా ఉండే విధంగానే చట్టాలను తీసుకువచ్చి అక్కడ ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం తాళిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్తో సంబంధాలను కొనసాగించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అక్కడ రోజురోజుకి పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనీసం చేసుకోవడానికి పని లేక తినడానికి తిండి లేక అక్కడి ప్రజలందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఏకంగా కుటుంబాన్ని పోషించడం కోసం కొంతమంది.. ఏకంగా తమ కిడ్నీలను కూడా  అమ్ముకుంటున్న దీనస్థితి ఆఫ్ఘనిస్తాన్ లో కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఇంత జరుగుతున్న అక్కడి ప్రభుత్వం మాత్రం పట్టనట్లుగానే వ్యవహరిస్తూ ఉంది. ప్రజలను బానిసలుగా మార్చి చిత్రహింసలకు గురిచేస్తుంది అని చెప్పాలి.

 అయితే ఆఫ్గనిస్తాన్ లో పాలన తాళిబన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయి అనే విషయంపై ఐక్యరాజ్యసమితి ప్రతినిధి రమేష్ కీలక విషయాలను వెల్లడించారు అని చెప్పాలి. గత 18 రోజుల్లో ఏడు లక్షల మందికి పైగా ఉపాధి కోల్పోయారు అన్న విషయాన్ని ఆయన చెప్పుకోచ్చారు. ఆఫ్గనిస్తాన్ లో 65% మందికి సహాయం అందించాల్సిన అవసరం ఉంది అంటూ తెలిపారు. అంతేకాదు ఇక అక్కడ నిత్యవసరలా సరుకుల ధరలు 30% పెరిగాయని.. ఇక 60 లక్షల మంది ఆహారం లేక అల్లాడిపోతున్నారు అన్న విషయాన్ని వెల్లడించారు. ప్రజలకు వస్తున్న ఆదాయంలో మూడు వంతులు కూడా కేవలం ఆహారంకి మాత్రమే సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: