గబ్బిలాల పులుసు తిన్న యువతి.. చివరికి ఏం జరిగిందంటే?
కానీ ఇప్పటికి చైనా, థాయిలాండ్ దేశాలలో ప్రమాదకరమైన విషయాన్ని కూడా బేకాతరు చేస్తూ ఇక ఇష్టం వచ్చిన ఆహారాన్ని తింటూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. చిత్రవిచిత్రమైన జంతువులను పక్షులను కూడా ఆహారంగా మార్చుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా ఓ యువతి కరోనా వైరస్ రావడానికి కారణమైన గబ్బిలాలను తినడం హాట్ టాపిక్ గా మారిపోయింది. గబ్బిలాలతో కూడిన ఒక బ్యాట్ సూప్ తాగుతూ ఎంతో రుచిగా ఉంది అంటూ సదరు యువతి వర్ణించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది .
ఇక ఈ విషయం ఫేస్బుక్లో వైరల్ గా మారిపోవడంతో వెంటనే థాయిలాండ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇక గబ్బిలాల పులుసును తిన్న ఆ యువతిని పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పాలి. పొంచెనోక్ శ్రీసునక్లువ అనే యువతీ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ తో పాటు ఫేస్బుక్లో కూడా ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ పోస్ట్ చేసింది. ఇలా నెటిజెన్స్ ని ఆకర్షించడానికి గబ్బిలాల పులుసు తిన్న యువతి చివరికి జైలు పాలు కావడంతో.. ఇలాంటివి అవసరమా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్స్.