అత్తను చంపిన ఎన్నారై.. భార్యపై దారుణం..!

Suma Kallamadi
చాలా మంది కిరాతకులు తన మన పర అనే బేధం లేకుండా కట్టుకున్న భార్యలు, బంధువులను, కుటుంబ సభ్యులను హత మారుస్తున్నారు. మన అనుకున్న వారితోనే శత్రుత్వం అన్నట్లు వీరు చేస్తున్న అరాచకత్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా చండీగఢ్‌ లోని హోషియార్‌పూర్ జిల్లాలో దారుణం ఘటన అందర్నీ కలచివేస్తోంది. ఒక ఎన్నారై తన భార్య, అత్తపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన చబ్బేవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాంగియాన్ గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ కాల్పుల్లో ఎన్నారై అత్త చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. భార్సింగ్‌పురా గ్రామానికి చెందిన మందీప్ సింగ్ అమెరికాలో నివసించేవాడు. తాజాగా మూడేళ్ల తర్వాత మళ్ళీ అమెరికా నుంచి తిరిగి స్వదేశానికి వచ్చేసాడు. శనివారం సాయంత్రం తన భార్య షవ్‌దీప్ కౌర్‌(28)ను కలుసుకోవడానికి తన అత్తవారింటికి వెళ్లాడు. అయితే ఏమైందో ఏమో ఇంకా తెలియ రాలేదు కానీ ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మందీప్ సింగ్ తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. తన భార్యతో పాటు తన అత్త బల్బీర్ కౌర్(58)‌పై కాల్పులు జరిపాడు.

ఈ దాడిలో బల్బీర్ చనిపోగా.. షవ్‌దీప్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దం వినపడటం తో స్థానికులంతా బల్బీర్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే హంతకుడు మందీప్ సింగ్ కారులో ఎక్కి పారిపోతున్నాడు. దాంతో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న షవ్‌దీప్ ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్వీర్ సింగ్ స్పందించారు. మందీప్ సింగ్ ను పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని వెల్లడించారు. హంతకుడు విదేశాలకు పారిపోకుండా ఆపేందుకు అతనిపై లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు భార్య షవ్‌దీప్ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: