‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’పై వర్మ ఆవేదన ఇలా తెలిపాడు!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’చిత్రంపై మొదటి నుంచి రక రకాలుగా ప్రమోషన్ వర్క్ చేస్తూ అందరి దృష్టి మళ్లించే విషయంలో రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అయ్యారు.  ఈ చిత్రం మొదటి నుంచి ఎన్నో వివాదాల మద్య గత నెల 29 న రిలీజ్ అయ్యింది.  కాకపోతే ఏపిలో మాత్రం ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.  ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం ఉంటుందని కొంతమంది హై కోర్టును ఆశ్రయించడంతో .. న్యాయస్థానం స్టే విధించింది. 

ఈ విషయంపై చిత్ర యూనిట్ సుప్రీమ్ కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.  అంతే కాదు ఈ చిత్రం పైరసీ కోరల్లో కూడా చిక్కుకుంది.  అయితే ఓ చిత్రంపై ఇంత కక్ష్య పూరిత చర్యలు తీసుకుంటారా అని రాంగోపాల్ వర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తన ఆవేదనను పెయింటింగ్స్ రూపంలో తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.  గొలుసులతో కట్టేయబడిన ఒక కోతిపిల్ల పెయింటింగును వర్మ షేర్ చేశారు. ఆ కోతిపిల్లను 'లక్ష్మీస్ ఎన్టీఆర్'  ఈ చిత్రం రిలీజ్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను..ఇక అలసి పోయాను అనేది దాని భావంగా పేర్కొన్నారు. 

ఇక తల్లికోతి .. పిల్లకోతిని ఓదార్చే మరో పెయింటింగును కూడా ఆయన షేర్ చేశారు. ఈ బొమ్మలో తాను తల్లి కోతిగా..లక్ష్మీస్ ఎన్టీఆర్ పిల్ల కోతిగా ఏపిలో ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పరిస్థితి ఇది అంటూ తన భావాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
Mother Rgv consoling #LakshmisNTR baby😢😢😢 Painting done by a truly truthful and deep visionary ⁦@DPrasannavarma⁩ pic.twitter.com/S4RTE5AEnN

— Ram Gopal Varma (@RGVzoomin) April 4, 2019 I am so tired of all these high court and Supreme Court delays of #LakshmisNTR 😢🙄😫 Painting done by the awesomely talented @DPrasannavarma pic.twitter.com/8K80GP0c2t

— Ram Gopal Varma (@RGVzoomin) April 4, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: