కొరటాల -చిరు సినిమాపై ఆశలు వదిలేసుకున్న మెగా అభిమానులు..?

KSK
సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో చిరంజీవి సైరా సినిమా తర్వాత ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా నడుస్తుండటంతో కొరటాలతో చేయబోయే సినిమా ఆలస్యంగా మొదలవుతుందని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినబడుతున్న టాక్.


ముఖ్యంగా కొరటాల తో చేయబోయే సినిమా మరియు ‘సైరా’ సినిమా ఈ రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ కూడా రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో కొరటాలతో చిరంజీవి చేయబోయే సినిమా చాలా ఆలస్యం అవుతుందని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది.


ఇప్పటికే సైరా సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావాల్సిన క్రమంలో సాంకేతిక కారణాలతో సినిమా ఆలస్యం కావడంతో మెగా అభిమానులు డైరెక్టర్ సురేందర్ రెడ్డి పై ఆయన పనితనంపై మండిపడుతున్నట్లు సినిమా గురించి కనీసం ఒక అప్డేట్ కూడా బయటకు రాకుండా వ్యవహరించడం అభిమానులకు కొంత కోపాన్ని తెప్పిస్తున్నట్లు తెలుస్తుంది. సైరా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కొరటాలతో చిరంజీవి చేయబోయే సినిమా కచ్చితంగా ఆలస్యమవడం ఖాయమని మరి ఇటువంటి తరుణంలో సినిమా ఆగిపోతుందో మొదలవుతుందో అన్న అనుమానం మెగా అభిమానుల్లో నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: