ఇంత ఘోరమా..నాకు ఏడుపొస్తుంది..! : విజయ్ దేవరకొండ

Edari Rama Krishna
ఎంటబ్బా..ఇలా చేస్తారనుకోలేదు..మిమ్మల్ని దారుణంగా నమ్మినా..కానీ నా మనసు దెబ్బతినేలా చేశారు..ఈ మాటలు అంటుంది ఎవరో కాదు ‘అర్జున్ రెడ్డి’తో తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.  అర్జున్ రెడ్డితో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ  తాజాగా నటించిన ‘గీత గోవిందం’చిత్రం లీక్ కావడంపై అసహనం వ్యక్తం చేశాడు.  ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ ఉండే విజయ్ దేవరకొండ అప్ సెట్ గా కనిపించాడు.

కారణం పైరసీ.. గీతాగోవిందం సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడిందనే వార్తలు విజయ్ ని కలిచివేశాయి.  అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో ‘గీతాగోవిందం’ తెరకెక్కింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ ప్రసంగం అందరినీ ఎమోషన్ కు గురిచేసింది.  ‘అరవింద్ గారు - వాసు గారు - మాటీం అంతా ఎంత కష్టపడి సినిమా తీశామో మాకు తెలుసు.. వారంతా ఇప్పుడు నవ్వుతూ కనిపిస్తున్నా.. పైరసీ వల్ల వారు లోపల ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు’ అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.

తాజాగా ‘గీతా గోవిందం’ లీక్ పై విజయ్ దేవరకొండ ట్విట్ చేశాడు. ‘నేను చాలా నిరాశకు లోనవుతున్నా. హర్ట్ అయ్యా. ఒకసారి కోపం వస్తుంది. ఇంకోసారి ఏడుపొస్తుంది’ అని ట్వీట్ చేశాడు.  సినిమా సీన్స్ లీక్ వ్యవహారంతో బాధపడి విజయ్ ఈ ట్వీట్ చేసుంటాడని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్ని లీకులు ఎదురైనా మనకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని విజయ్ కు ధైర్యం చెప్పారు. చిల్ రౌడీ.. లైట్ తీసుకో అంటూ విజయ్ ను ఓదారుస్తున్నారు అభినులు.  విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే. 
I feel let down, disappointed, hurt.
Okka sari kopam osthundi, inko sari edupostundi.

— Vijay Deverakonda (@TheDeverakonda) August 12, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: