తిరుమల శ్రీవారి దర్శించుకున్న నటి శ్రియ..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ‘ఇష్టం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ శ్రియ అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.  సీరియర్ హీరోల నుంచి జూనియర్ హీరొల వరకు ఈ అమ్మడు ఎవ్వరితోనైనా సై అంటుంది. ఇండస్ట్రీకి పది సంవత్సరాలు పైగా అయినా శ్రియ మాత్రం ఇప్పటికీ గ్లామర్ మెయింటేన్ చేస్తుంది.

ఆ మద్య తెలుగు లో కాస్త చాన్స్ లు తగ్గడంతో ఐటమ్ సాంగ్స్ కి కూడా ఓకే చెప్పేసింది శ్రియ.  ఈ సంవత్సరం బాలయ్య నటించిన వందవ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రంలో ఓ బిడ్డకు తల్లిగా నటించి మెప్పించింది శ్రియ.  తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘పైసా వసూల్’ చిత్రంలో కూడా నటించింది.  

నక్షత్రం చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో అదరగొట్టింది.  తాజాగా శ్రియ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఉదయం సుప్రభాత సమయంలో స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు  వారికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని శ్రియ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: