అందరు అనుకున్నట్లే చేసిన త్రిష..ఇది నిజమైన ప్రేమ అంటే..!
దీనికి ప్రధాన కారణంగా రాజకీయ అంశాలే వినిపిస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న ‘రెడ్ జెయింట్ మూవీస్’ సంస్థ తమిళనాడు మాజీ సీఎం కుటుంబానికి చెందినది కావడం . అలాగే కమల్ హాసన్ కూడా ఈ ప్రాజెక్ట్లో నిర్మాతగా వ్యవహరిస్తుండటం ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాలో నటించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని తమిళ స్టార్ హీరో సీఎం విజయ్.. త్రిషకు సూచించినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే విజయ్, త్రిష మధ్య ఉన్న సన్నిహిత సంబంధంపై ఎన్నో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని అభిమానులు ఎప్పటినుంచో మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ చెప్పిన మాటకు ప్రాధాన్యం ఇచ్చి త్రిష ఈ ప్రాజెక్ట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందనే వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి. కొందరు దీనిని ప్రేమకు నిదర్శనంగా చెప్పుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని అంటున్నారు.
అయితే ఇప్పటివరకు ఈ విషయంపై త్రిష కానీ, చిత్రబృందం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కోలీవుడ్లో మాత్రం ఇదే పెద్ద చర్చగా మారింది. అభిమానులు కూడా అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.