“నా పెళ్లాం నిప్పురా”.. ట్రెండ్ ఫాలో అయిన కొత్త పెళ్లికొడుకు!

Amruth kumar
పెళ్లి అంటేనే సందడి. సినీ తారల పెళ్లి అంటే ఆ సందడి ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. తిరుమలలో ఘనంగా జరిగిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం ఇండస్ట్రీ వర్గాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రాజసం ఉట్టిపడేలా జరిగిన ఈ వేడుక తర్వాత, సోషల్ మీడియాలో ఈ జంట ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే, తన భార్యతో ఉన్న ఒక బ్యూటిఫుల్ మూమెంట్‌ను షేర్ చేస్తూ శ్రీనివాస్ వేసిన వెటకారం మాత్రం అందరినీ నవ్వుకునేలా చేసింది.

శ్రీనివాస్ సోషల్ మీడియాలో పెట్టిన క్యాప్షన్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు, ఆ తర్వాత పడి పడి నవ్వుకున్నారు. ఆయన తన భార్యను పరిచయం చేస్తూ “నా పెళ్ళాం నిప్పురా!” అని పోస్ట్ చేయడం, ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ డైలాగ్ కొత్తది కాదు, ఇది ఆయన నటించిన ‘జయ జానకి నాయక’ చిత్రంలోనిది. ఒక ఎమోషనల్ సీన్‌లో ఈ డైలాగ్ వస్తుంది.ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ డైలాగ్ రకరకాల వెర్షన్లు (తెలంగాణ యాస, వైజాగ్ స్లాంగ్, జపాన్ వెర్షన్ అంటూ) విపరీతంగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో ఈ డైలాగ్‌పై ఎన్ని జోకులు వచ్చాయో మనకు తెలిసిందే. ఆ డైలాగ్‌కు సోర్స్ అయిన బెల్లంకొండ స్వయంగా, అది కూడా తన పెళ్లి విషయంలోనే ఆ డైలాగ్‌ను వాడటం అనేది నిజంగా ఫన్నీ మూమెంట్. "ఒరిజినల్ హీరోనే ఇలా తన భార్యకు అప్లై చేసేసరికి, ఫ్యాన్స్‌కు పండుగైపోయింది."

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు శ్రీనివాస్ సెన్సాఫ్ హ్యూమర్‌ను మెచ్చుకుంటున్నారు. "శ్రీనివాస్ బ్రో.. మీరు మామూలోళ్లు కాదు!", "ఆ ఒరిజినల్ డైలాగ్ కి పెట్టిన కరెక్ట్ పంఛ్ ఇదే!" అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ జంటకు బెస్ట్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి.ఒక స్టార్ హీరో తన సినిమాలోని వైరల్ డైలాగ్‌ను పర్సనల్ లైఫ్‌లో వాడుకోవడం అనేది చాలా అరుదు. ఇది ఆయన ఎంత కూల్ అండ్ ఫన్నీ పర్సనో చెబుతోంది. మ్యాచో స్టార్ అని పేరున్న సాయి శ్రీనివాస్, తన పెళ్లి సమయంలో ఇలాంటి ఫన్ క్రియేట్ చేయడం ఫ్యాన్స్‌కు మరింత దగ్గర చేసింది.కెరీర్ పరంగా బిజీగా ఉన్నా, తన పర్సనల్ లైఫ్‌లో ఇలాంటి సరదా క్షణాలను అభిమానులతో పంచుకోవడం బాగుంది. ‘జయ జానకి నాయక’ చిత్రం నుంచి ఇన్నాళ్లకు ఈ డైలాగ్ మళ్ళీ ఒకసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. మొత్తానికి బెల్లంకొండ కొత్త జంటకు సోషల్ మీడియా నుంచి అభినందనల వర్షం కురుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: