కొరటాలకు పెద్ద చిక్కే వచ్చి పడింది.. ఆ ఒక్కటి సమస్యగా మారింది..!
కొరటాల శివ సినిమాల్లో హీరోలు ఎంత పవర్ఫుల్ గా ఉంటారో, అంత పద్ధతిగా (Settled) కనిపిస్తారు. బాలకృష్ణకు ఇలాంటి డిగ్నిఫైడ్ మాస్ పాత్రలు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. గతంలో ‘లెజెండ్’ లేదా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాల్లో బాలయ్య చూపిన హుందాతనం, కొరటాల విజన్ కలిస్తే థియేటర్లలో విజువల్ ట్రీట్ గ్యారెంటీ. అందుకే నందమూరి ఫ్యాన్స్ ఈ కాంబో అనౌన్స్మెంట్ వినగానే అప్పుడే ‘హిట్’ కొట్టేశామన్న ధీమాతో ఉన్నారు.ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఒక్కటే.. ఈ ప్రాజెక్టుకు సంగీతం అందించేది ఎవరు? కొరటాల శివ తన సినిమాల్లో మ్యూజిక్కు ఇచ్చే ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఉన్న ఆప్షన్లలో ఎవరిని ఎంచుకోవాలో అన్నది పెద్ద సవాల్గా మారింది.
కొరటాలకు దేవిశ్రీ ఒక సక్సెస్ఫుల్ జోడీ. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మిర్చి’, ‘జనతా గ్యారేజ్’ ఆల్బమ్స్ చాట్ బస్టర్లు. కానీ ప్రస్తుతం దేవి ‘ఎల్లమ్మ’ సినిమాతో బిజీగా ఉండటం వల్ల టైమ్ కేటాయించగలరా? అన్నది ప్రశ్న.బాలయ్య సినిమా అంటే తమన్ ఇచ్చే ఆర్.ఆర్ (RR) వేరే లెవల్లో ఉంటుంది. అయితే, కొన్నాళ్లుగా తమన్ పాటలు రొటీన్గా ఉంటున్నాయన్న ముద్ర పడిపోయింది. ఆర్.ఆర్ తో పాటు అదిరిపోయే పాటలు కూడా కావాలి కాబట్టి, తమన్ విషయంలో కొరటాల డైలమాలో ఉన్నారట.
ఈయన ఒక సెన్సేషన్. కానీ అనిరుధ్ చాలా టైమ్ తీసుకుంటాడు. బాలయ్య సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలంటే సంగీత దర్శకుడు ఫుల్ గా అందుబాటులో ఉండాలి. కాబట్టి అనిరుధ్ ఇక్కడ సెట్ కాకపోవచ్చు.బాలయ్య - కొరటాల సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించి, 2027 సంక్రాంతి బరిలో దించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. పండగ పూట బాలయ్య గర్జన ఉంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులన్నీ గాలిలో ఎగరాల్సిందే. మరి కొరటాల శివ ఈ ‘సంగీత’ సవాల్ను ఎలా అధిగమిస్తారో, ఎవరిని ఫైనలైజ్ చేస్తారో వేచి చూడాలి.