ఇది రా మావ అదృష్టం అంటే ..చిరంజీవి తర్వాత మరో స్టార్..ఈ డైరెక్టర్ చాలా లక్కి ఫెలో..!?
ఇదిలా ఉంటే, ‘బింబిసార’ సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ట ఇప్పుడు బాలకృష్ణతో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు మరింత హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల వశిష్ట బాలయ్యను కలిసి రెండు కథలను వినిపించాడట. అందులో ఒక కథ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసినదిగా చెబుతున్నారు. మరొక కథ మాత్రం బాలయ్య ఇమేజ్కు తగ్గట్టు పవర్ఫుల్, మాస్ ఎలిమెంట్స్తో నిండినదిగా ఉందట. ఈ రెండు కథల్లో, బాలకృష్ణ తన కోసం రూపొందించిన కథపైనే ఎక్కువ ఆసక్తి చూపినట్లు సమాచారం. ఆ కథలో ఉన్న బలం, ఆయన స్టైల్కు సరిపోయే ఎలివేషన్స్, మాస్ అప్పీల్ ఇవి ఆయనను ఆకట్టుకున్నాయని టాక్. ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత, వచ్చే ఏడాది ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్పైకి వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఇక దర్శకుడు మల్లిడి వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ‘విశ్వంభర’ అనే భారీ సోషియో-ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూలైలో విడుదలకు సిద్ధమవుతోంది. గతంలోనే వశిష్ట, రామ్ చరణ్ మరియు చిరంజీవిలకు కథలు వినిపించి, ఇండస్ట్రీలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ‘విశ్వంభర’ ద్వారా అతనికి గోల్డెన్ అవకాశం లభించగా, ఇప్పుడు బాలకృష్ణతో కూడా సినిమా ఓకే అవ్వడం అతని కెరీర్లో మరో పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూస్తే, వరుసగా టాలీవుడ్ టాప్ స్టార్స్తో పని చేసే అవకాశం రావడం దర్శకుడు వశిష్టకు నిజంగా అరుదైన అదృష్టం. ఒకేసారి మెగాస్టార్ మరియు నటసింహం వంటి దిగ్గజాలతో ప్రాజెక్టులు చేయడం అంటే, అతను ఇండస్ట్రీలో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంటున్నాడనే చెప్పాలి. ఈ కాంబినేషన్లు నిజంగా ఎలా ఉంటాయో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.