వార్నీ.. కమల్, రజినీ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ తెరకెక్కించేది ఆ డైరెక్టరా..?
ఈ తాజా బజ్ ప్రకారం, ‘జైలర్’ సినిమాతో భారీ విజయం సాధించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మెగా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ను టేకోవర్ చేసినట్లు బలమైన రూమర్స్ వినిపిస్తున్నాయి. రజినీకాంత్ స్టైల్ను మాస్ ఆడియన్స్కు సరికొత్తగా చూపించడంలో నెల్సన్ సక్సెస్ కావడంతో, ఇలాంటి భారీ ప్రాజెక్ట్కు అతనే సరైన ఎంపిక అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇదే సమయంలో, నెల్సన్ ఇప్పటికే రజినీ–కమల్ కలయికపై ఒక అనౌన్స్మెంట్ కట్ తరహా వీడియోను సిద్ధం చేస్తున్నాడని కూడా టాక్ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ వెంటనే సెట్స్పైకి వెళ్లే అవకాశం లేదని, ప్రారంభానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చని సమాచారం. ప్రస్తుతం నెల్సన్ ‘జైలర్ 2’ కాకుండా తెలుగులో ఒక సినిమా చేయాల్సి ఉందని, అది పూర్తయ్యాకే ఈ భారీ మల్టీ స్టారర్పై ఫోకస్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి, రజినీకాంత్ మరియు కమల్ హాసన్ మళ్లీ ఒకే తెరపై కనిపిస్తే అది కేవలం తమిళ సినిమాకే కాదు, మొత్తం ఇండియన్ సినీ పరిశ్రమకే ఒక చారిత్రాత్మక ఘట్టంగా మారే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్ స్థాయిలోనే ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత వచ్చే అవకాశముంది. అప్పటివరకు ఈ క్రేజీ కాంబినేషన్పై అభిమానుల ఉత్సుకత మాత్రం ఆగేలా కనిపించడం లేదు.