రాజాసాబ్: ఆ ఒక్క సీన్ కి రూ.20 కోట్లు.. ?

Divya
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ జోనర్లో (జనవరి 9) ఈ రోజున భారీ అంచనాల మధ్య విడుదలై థియేటర్లో సందడి చేస్తోంది. ప్రస్తుతమైతే ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా చూసి ఖుషి అవుతున్నారు. ఇటువంటి సందర్భంలోనే సినిమాకి సంబంధించి సీక్వెల్స్ పైన, సినిమాలో కొన్ని ఫైట్ సీన్స్ కు సంబంధించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజా సాబ్ సినిమాలో కేవలం ఒక్క సీను కోసం రూ .20 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.




సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు అనడానికి ఇదే నిదర్శనం. కేవలం ఒకే ఒక్క సీన్ కోసం రూ.23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఖర్చుతో ఏదైనా ఒక చిన్న సినిమా తీసేయొచ్చు. అయితే ఆ సీన్ ఏదో కాదు ప్రభాస్ మొసలితో పోరాడే సీన్. వాస్తవానికి ఈ సీన్ షూటింగ్ దశలో ఉన్నప్పుడు బడ్జెట్ పరిమితిని దృష్టిలో పెట్టుకొని ఆ సీన్ తొలగించాలని డైరెక్టర్ భావించినప్పటికీ కానీ ప్రభాస్ కు ఈ సీన్ ఐడియా విపరీతంగా నచ్చడంతో కచ్చితంగా అది సినిమాలో ఉండాల్సిందే అని పట్టు పట్టారట.


అంతేకాకుండా ఒకవేళ బడ్జెట్ సమస్యగా మారితే తన రెమ్యూనరేషన్ లో కోత విధించిన పర్వాలేదని ప్రేక్షకులకు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి విజువల్ ట్రీట్ అందించాలని ప్రభాస్ కోరడంతోనే అంత బడ్జెట్ పెట్టడం వెనుక నిర్మాతలు వెనుకడుగు వేయలేదు. ట్రైలర్ హైప్ తీసుకురావడానికి కూడా ఈ సీన్ బాగా ఉపయోగపడింది. థియేటర్లో కూడా ఈ సీన్ కి విజిల్స్ వేసినట్టుగా కనిపిస్తోంది ఫ్యాన్స్. ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహన్ నటించగా సంజయ్ దత్, బోయన్ ఇరాని వంటి దిగ్గజ నటులు ఇందులో నటించారు. అలాగే వెన్నెల కిషోర్, బ్రహ్మానందం వంటి వారు కూడా నటించారు. థమన్ అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉంది. మరి మొదటి రోజు ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి రాజాసాబ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: