మొత్తానికి కూలీ సినిమా ఫ్లాప్ పై.. నోరువిప్పిన లోకేష్..!
లోకేష్ కనకరాజు, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్లో కూలీ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల మధ్య కూలీ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలయ్యింది. ఈ చిత్రంలో నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ తో పాటుగా మరి కొంతమంది నటీనటులు నటించారు. అయితే ఈ సినిమా విడుదల సమయంలో చాలానే విమర్శలు కూడా వినిపించాయి. తాజాగా అ విషయం పైన లోకేష్ మాట్లాడుతూ కూలీ సినిమా పైన ఎన్నో విమర్శలు వచ్చాయి.. దీంతో తన తదుపరి సినిమాలో సరిచేసుకుని ప్రయత్నం చేస్తాను.. నా పైన ట్రోల్స్ వచ్చినప్పటికీ జనాలు మాత్రం రజనీకాంత్ కోసమే సినిమా చూశారని, అలా ఆ సినిమాకి రూ .500 కోట్లు వచ్చాయని నిర్మాతలు చెప్పడంతో ఆనందపడ్డానని తెలిపారు.
అందుకు ప్రేక్షకులకు కూడా తాను ధన్యవాదాలు చెప్పాలని.. తాను ఎప్పుడూ కూడా అంచనాల మీద కథలు రాసుకోలేదని రాసుకున్న కథలలోని పాత్రలు ఆడియన్స్ కి నచ్చితేనే తనకి కూడా ఆనందమని తెలిపారు. ఒకవేళ అలా అందుకో లేకపోతే, అ తర్వాత చిత్రం అందుకోవడానికైనా ట్రై చేస్తూ ఉంటానని తెలిపారు లోకేష్. తన దర్శకత్వం నుంచి తదుపరి సినిమా పై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.