తల్లిదండ్రులు అన్నపూర్ణ, ఏఎన్నార్ కోసం నాగార్జున చేసిన మంచిపని ఇదే.. !
కింగ్ నాగార్జున అక్కినేని కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు, సిబ్బంది, హాజరైన వారందరికీ ఒక చిరస్మరణీయ క్షణాన్ని అందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ,.. తన తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ అక్కినేని జ్ఞాపకార్థం అక్కినేని కుటుంబం ఏఎన్ఆర్ కళాశాలలో 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ నిర్ణయం తాను, తన సోదరి సుశీల, సోదరుడు వెంకట్, మొత్తం ఏఎన్ఆర్ కుటుంబం కలిసి తీసుకున్నట్లు తెలిపారు.
“ఈ నిధిని సరైన పద్ధతిలో అమలు చేయడానికి మేము ఏఎన్ఆర్ కళాశాల యాజమాన్యంతో కలిసి పని చేస్తాము. సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ సంస్థకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు, ఆయన వారసత్వాన్ని కొనసాగించడం మా బాధ్యత. ఈ ప్రకటనకు విద్యార్థులు, అధ్యాపకుల నుంచి కరతాళ ధ్వనులు లభించాయి. ఇది కేవలం కుటుంబం యొక్క ఉదారతను మాత్రమే కాకుండా, విద్య, సమాజ సేవతో వారికి ఉన్న శాశ్వత అనుబంధాన్ని కూడా చాటింది. నాగార్జున తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఏఎన్నార్ కాలేజ్ ను మరింత ముందుకు తీసుకు వెళ్లేలా తీసుకున్న ఈ నిర్ణయానికి ఏఎన్నార్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నాగార్జున ఫ్యామిలీ విషయానికి వస్తే నాగార్జున ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు అయ్యాయి. నాగచైతన్య, అఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కెరీర్ పరంగా ఇద్దరూ కాస్త తడబడుతోన్న పరిస్థితి. అఖిల్ నటిస్తోన్న లెనిన్ సినిమా యేడాది నుంచి సెట్స్ మీద ఉన్నా ఇంకా రిలీజ్ కాలేదు. ఇటు చైతు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ను పెళ్లాడి వరుస సినిమాల మీద కాన్ సంట్రేషన్ చేస్తున్నారు. శోభిత త్వరలోనే ట్విన్స్ కు జన్మనివ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.