బాహుబలి బుకింగ్స్ ... వాళ్లను భయపెడుతున్నాయ్... !
ఓవర్సీస్ మాత్రమే కాదు, ఇండియాలో కూడా రీ–రిలీజ్ సినిమాల మధ్య ఈ సినిమా భారీ వసూళ్లు సాధించబోతుందని ట్రేడ్ టాక్. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు రు. 10 కోట్లకు పైగా వసూలైనట్టు సమాచారం. ఏపీ, తెలంగాణలో వర్షాలు కొంతవరకు ప్రభావం చూపినా, ఇప్పుడు వాతావరణం క్రమంగా మెరుగుపడటంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు తిరిగి వస్తున్నారు. వారాంతం కోసం వినోదం కావాలనుకునే కుటుంబాలు, యువత, పిల్లలు అందరూ బాహుబలినే మొదటి ఆప్షన్గా తీసుకుంటున్నారు.
రాజమౌళి ఈ రీ – రిలీజ్ను కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకుని .. పనులు అన్నీ దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఇంటర్వ్యూలు, మేకింగ్ వీడియోలు, స్పెషల్ ప్రోమోలు, సోషల్ మీడియా క్యాంపెయిన్ అన్నింటినీ రాజమౌళి స్వయంగా గమనించారు. ప్రభాస్ ఇమేజ్ మళ్లీ బిగ్ స్క్రీన్ మీద మెరిసిపోగా, ఫ్యాన్స్ ఆ ఉత్సాహంతో థియేటర్లను పండుగలా మార్చేశారు. మొత్తానికి, ‘బాహుబలి: ది ఎపిక్’ మళ్లీ బాక్సాఫీస్పై దండయాత్ర మొదలుపెట్టింది. నిజంగానే రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్కి సరిలేరు మీకెవ్వరూ అనిపించే సమయం ఇది.