కొత్త టాటూతో ప్రభాస్ హీరోయిన్..టాటూ వెనుక అంతా కథ ఉందా..?

Divya
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ కృతిసనన్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్యతో దోచేయ్, ప్రభాస్ తో రామాయణం వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలలో నటిస్తూ అక్కడే స్థిరపడిపోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక కొత్త టాటూ వేయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ ని షేర్ చేసింది. తాను మొదటిసారిగా వేయించుకున్న టాటూ అంటూ తెలిపింది కృతి సనన్.


ఈ టాటూని తన కాలు మీద వేయించుకుంది.. ఎగిరే పక్షి టాటూ. దాని కింద ఒక ప్రేరణాత్మకమైన కొటేషన్ కూడా రాసుకుంది. ఈ టాటూ వెనుక ఉన్న భావాన్ని వివరిస్తూ.. "నేను టాటూ వేయించుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు కానీ మొదటిసారి వేసుకున్నాను.. నా వాగ్దానం నెరవేరింది.. ఈ టాటూలో ఉండే పక్షి లాగే తాను కూడా స్వేచ్ఛగా ఉదయం సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ నా జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను.. కళ్ళల్లో కళలు ఉన్నవారు మీరు భయపడే ఆ ఎత్తుని అంగీకరించాలి.. అది అంత సులువు కాదు.. కానీ మీ మార్గాన్ని మీరు కనుక్కోవడంలో ఎగరడం నేర్చుకుంటారు అందుకు ముందు అడుగు వేయాలి అంటూ తన టాటూ వెనుక ఉన్న భావనను తెలియజేసింది".


కృతి సనన్ చేసిన ఈ బాగోద్వేగమైన టాటూ పోస్టు సోషల్ మీడియాలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేకుండా నటిస్తోంది. గత కొంతకాలంగా కృతి సనన్ పెళ్లి విషయం పైన కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమధ్య ప్రభాస్ తో డేటింగ్ అంటూ రూమర్స్ వినిపించగా ఆ విషయాన్ని ఖండించింది. కానీ త్వరలోనే స్టార్ హీరోతో ఈమె పెళ్లి కాబోతోంది అంటూ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: