మరో సారి రాజా పై ప్రేమ బయటపెట్టిన దివ్వెల మాదిరి..!

Divya
ఎట్టకేలకు తెలుగు బిగ్ బాస్ 9 షో సెప్టెంబర్ 7వ తేదీన గ్రాండ్ గానే ప్రారంభమయ్యింది. సుమారుగా 15 మంది కంటెస్టెంట్ అడుగు పెట్టారు. ఇందులో 9మంది సెలబ్రిటీలు మరో 6 మంది కామనర్స్ కేటగిరీలో అడుగుపెట్టారు. ఇలా హౌస్ లో చూసుకుంటే ఓనర్స్ వర్సెస్ టెనెల్స్ అంటూ హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. కానీ ఈ సీజన్ మొదలవక ముందే సోషల్ మీడియాలో చాలామంది పేర్లు లీక్ అయ్యాయి. దాదాపుగా 90% వారే హౌస్ లోకి అడుగుపెట్టారు. మొదటి నుంచి దివ్వెల మాధురి కూడా బిగ్ బాస్ 9 హౌస్ లోకి రాబోతుందని వార్తలు వినిపించాయి కానీ ఆమె రాలేదు.


అయితే ఇటీవలే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆమె ఒక కార్యక్రమంలో పాల్గొనింది. అక్కడ బిగ్ బాస్ 9 ఆఫర్ పై క్లారిటీ ఇచ్చింది.. తనకు అవకాశం వచ్చిన మాట నిజమే కానీ అన్ని రోజులు నా రాజాకి దూరంగా ఉండడం కుదరదని.. అది చాలా కష్టంగా అనిపించింది. అందుకే ఆయనని వదిలి తాను అన్ని రోజులు హౌస్ లో ఉండలేనని బిగ్ బాస్ 9 ఆఫర్ ని తాను రిజెక్ట్ చేశానంటూ తెలియజేసింది మాధురి. ఇలా మారోకసారి తన రాజా మీద ఉండే ప్రేమను బయటపెట్టింది.



దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ హౌస్ నుంచి తమకు కబురు వచ్చిన మాట నిజమే కానీ.. అందులో మాధురిని హౌస్ లోకి తీసుకుంటామని అడగగా అయితే ఆమె ఒప్పుకోలేదు. మేమిద్దరం కలిసి చేయవలసిన పనులు చాలానే ఉన్నాయని.. ఆ సమయంలో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే కచ్చితంగా డిస్టర్బ్ అవుతామని.. అందుకే మాధురి ఆఫర్ ను వద్దనుకున్నదంటూ శ్రీనివాస్ తెలియజేశారు. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లోనైనా హౌస్ లోకి అడుగుపెట్టి అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: