ఘాటి.. మదరాసి : ఓటిటి హక్కులు ఆ క్రేజీ సంస్థ చేతికి.. స్ట్రీమింగ్ కోసం అప్పటివరకు ఆగాల్సిందే..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఏదైనా సినిమా థియేటర్లలో విడుదల అయింది అంటే చాలు ఆ సినిమా ఏ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తుందా ... ఎప్పుడు ఓ టీ టీ లోకి ఇస్తుందా అనే దానిపై జనాలు అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే నిన్న అనగా సెప్టెంబర్ 5 వ తేదీన అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఘాటి అనే సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తో పాటు నిన్న తమిళ నటుడు శివ కార్తీకేయన్ హీరోగా రుక్మిణి వాసంత్ హీరోయిన్గా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన మదరాసి సినిమా కూడా విడుదల అయింది. ఈ రెండు సినిమాల ఓ టి టి విడుదల గురించి తెలుసుకుందాం.

అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ఘాటీ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన మదరాసి సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాను కూడా కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓ టి టి సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మంచి అంచనాల నడమ విడుదల ఈ రెండు సినిమాలకు కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: