
ఒకప్పుడు బూతులు.. ఇప్పుడు పొగడ్తలు.. మెగా తలరాతని మార్చేసిన లేడీ..!
మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫారిన్ అమ్మాయి అన్నాలెజినోవా ను పెళ్లి చేసుకున్న మూమెంట్ లో దారుణాతి దారుణంగా మెగా ఫ్యామిలీ పై కామెంట్స్ పెట్టారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు హ్యూజ్ ట్రోలింగ్ కి గురి అయ్యే అన్న లేజీనోవాన ఇప్పుడు మెగా ఫ్యామిలీ తలరాతన మార్చిన సూపర్ లేడీగా మారిపోయింది . మెగా ఫ్యామిలీ లేడీస్ ఇప్పటివరకు ఎవరు కూడా తిరుమల వెళ్లి ఇలా గుండు ఇచ్చిన దాఖలాలు లేవు . అయితే పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా మాత్రం తన కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అంటూ తలనీలాలు సమర్పించడమే కాకుండా ఏకంగా 17 లక్షలు అన్నదానానికి డొనేట్ చేసింది.
దీనితో సోషల్ మీడియాలో నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ భార్య పేరు మారు మ్రోగిపోతుంది. స్టార్ సెలబ్రిటీ హోదాలో తలనీలాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్. నిజానికి పవన్ కళ్యాణ్ నే గుండు ఇవ్వాలి అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు కారణంగా గుండు ఇవ్వలేని మూమెంట్లో పండితుల సలహాతో భర్తలో సగ భాగమైన భార్య ఆ మొక్కును చెల్లించే విధంగా అన్నాలెజీనోవా తలనీలాలను సమర్పించిందట . ఇప్పుడు మెగా ఫ్యామిలీ గురించి అందరు పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు . దానికి కారణం అన్నాలెజినోవా నే అంటున్నారు జనాలు . ఒకప్పుడు అన్నాలెజినోవాను బూతులు తిట్టిన జనాలు ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు..!