రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కింగ్డమ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ కి హిందీలో రన్ బీర్ కపూర్, తమిళ్ లో సూర్య, తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు..
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా కింగ్డమ్ సినిమా రూపొందుతుంది.గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను శ్రీలంక సరిహద్దుల్లోని శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు.ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ డ్రామా రెండు భాగాలుగా ఉంటుందని మేకర్స్ తెలిపారు... ఈ సినిమాలో విజయ్ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.మే 30 న ఈ సినిమా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి విజయ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు..కింగ్డం మూవీ డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు విజయ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో తెలిపాడు..ఇప్పటికే సగం పూర్తి అయిందని సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది..
దీనితో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.. ఎప్పటి నుంచో సాలిడ్ హిట్ కోసం చూస్తున్న విజయ్ ఈ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నాడు..త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్నీ అప్డేట్స్ రానున్నాయి..విజయ్ తన తరువాత సినిమాలు కూడా ఎంతో భారీగా ప్లాన్ చేసుకున్నాడు.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు..