తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కంగువా “.. హీరో సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది..స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్గ్ మూవీ నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. సినిమాలో సూర్య నటన బాగున్నా కానీ.. కథలో కొత్తదనం లేకపోవడం పూర్ స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్ గా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు..
సాంగ్స్ బాగున్నా కానీ దేవిశ్రీ బిజిఎం పై విమర్శలు వచ్చాయి..బిజిఎం సౌండ్ భారీగా ఉండటంతో ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ వినిపించడం లేదని ప్రేక్షకులు విమర్శించారు.. సౌండ్ లెవెల్ తగ్గించిన లాగే ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.. 2000 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ కూడా అందుకోలేకపోయింది.. కంగువా ప్లాప్ తో నిరాశలో వున్న ఫ్యాన్స్ ని సూర్య మరో సినిమాతో పలుకరించనున్నాడు..
సూర్య హీరోగా తన 44వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతుంది.’రెట్రో’ అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్, ట్రైలర్ రిలీజ్ ఈ నెల 18 వ తేదీన జరగనున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.. మే 1 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది…