తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఇందులో కొంత మంది హీరోలకు అత్యధిక పాపులారిటీ ఉండడం వల్ల ఎక్కువగా జనాల్లో కనిపించరు. ఏదైనా సినిమా ఫంక్షన్స్ వారి సొంత ఫంక్షన్స్ తప్ప బయట తిరగడం లాంటివి చేయరు. కానీ కొంత మంది కామన్ హీరోలు ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా కానీ, చాలా సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి లో హీరో రవితేజ కూడా ఒకరు.. ఈయన ఒకానొక సమయం లో తనతో ఉన్నటు వంటి ఒక ఫ్రెండ్ ను పోలీస్ కేసులో ఇరికించారట. ఇంతకీ వారు ఏం చేశారో వివరాలు చూద్దాం.. టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ లలో రఘు కుంచె కూడా ఒకరు.
ఈయన కేవలం సింగర్ గానే కాకుండా, సంగీత దర్శకుడిగా ఎన్నో చిత్రాలకు పని చేశారు. ఈయన పాడిన, డైరెక్షన్ చేసిన ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో పాపులారిటీ అయిన "నాది నకిలీసు గొలుసు", ఎందుకే రమణమ్మ" అనే పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి రఘు కుంచెకు రవితేజకు ఫ్రెండ్షిప్ ఉంది. అయితే ఒకసారి రవితేజ తన బైక్ మీద వెళ్లే సమయంలో వెనక కూర్చోబెట్టుకొని వెళ్లాడు.
ఈ టైం లోనే హెల్మెట్ లేదని పోలీసులు తనని ఆపారు. దీంతో రవితేజ ఇది నా బైక్ కాదని నన్ను అడ్డంగా బుక్ చేశాడు. దీంతో హెల్మెట్ లేదని కేసు నా పైన పడింది అంటూ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయట పెట్టాడు. ఈ విధంగా రవితేజ నన్ను మోసం చేశాడని ఒకప్పుడు జరిగిన విషయాన్ని నవ్వుకుంటూ చెప్పుకొచ్చారు.. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.మరి రఘు కుంచె వ్యాఖ్యలపై నటుడు రవితేజ స్పందిస్తారా లేదా అనేది చూడాలి.