రవితేజతో ఆ ఇద్దరు .. కొత్త మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసారుగా..!

Amruth kumar
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు .. ప్రజెంట్ ఈ హీరో మాస్ జాతర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు .. అయితే ఆయన తర్వాత సినిమా ను కూడా ఇప్పటికే దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది .. క్లాస్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమల తో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ ను కూడా రవితేజ విన్నారు .. ఈ స్టోరీ కి సంబంధించిన ఫైనల్ వర్క్ జరుగుతుంది .. ఇక ఈ సినిమాకి అనార్కలి అనే పేరును కూడా ఓకే చేయబోతున్నారని తెలుస్తుంది ..


అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంటుంది .. అయితే ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరైనా ఆసక్తి అందరిలో ఉంది .. ఈ సినిమాలో నటించే హీరోయిన్ల రేసులో ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి .. వారిలో ఒకరు మ‌మితా బైజు, కయాడు లోహార్ ల‌ను ఈ సినిమాలో హీరోయిన్ల గా తీసుకోబోతున్నారనే  ప్రచారం జరుగుతుంది . ప్రేమలు సినిమాల తో భారీ క్రేజ్ తెచ్చుకున్న మమిత .. ఇక కయాడు గురించి చెప్పాల్సిన పనిలేదు .. రీసెంట్గా రిలీజ్ అయిన రిటన్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో ఈమె అ దరుగొట్టింది ..


వీరిద్దరూ యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్నారు .. పైగా ట్రెండింగ్ లో ఉన్నవారు .. కిషోర్ తిరుమల కథ లో హీరోయిన్లకు సైతం ఎంతో ప్రాధాన్యత ఉంటుంది .. అటు అందం ఇటు అభినయం తో రాణించాల్సిన పాత్ర లో మమిత , కయాడు పోటీపడి నటిస్తారని అందరి నమ్మకం . ఇక 2026 సంక్రాంతి కి ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది .. ఇదంతా జరగాలంటే త్వరగా ఈ సినిమా షూటింగ్ కి వెళ్ళాలి .. ఈ నెలాఖరు కు ఈ సినిమాపై ఓ క్లారిటీ రావచ్చని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: