కన్నప్ప సక్సెస్ కోసం.. పడరాని పాట్లుపడుతున్న తండ్రీ కొడుకులు..!

Divya
మంచు విష్ణు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా చిత్రంగా నటిస్తున్న చిత్రం కన్నప్ప.. ఈ చిత్రాన్ని తమ బ్యానర్ పైనే నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం తో పాటుగా పలు రకాల ఇండస్ట్రీల నుంచి ఒక్కొక్క సెలబ్రిటీను తీసుకురావడం జరిగింది. ఇటీవలే సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి అయిన సందర్భంగా తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి పలు విషయాలను సైతం తెలియజేస్తూ ఒక వీడియోని సైతం తన కుమారుడితో కలిసి షేర్ చేశారు.

అత్యంత కఠినమైన ప్రదేశాలలో సైతం కన్నప్ప సినిమా షూటింగ్ జరిగిందని చిత్ర యూనిట్ కేధరనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించడం జరిగింది. సినిమా సక్సెస్ కోసమే తండ్రి కొడుకులు ఇలా అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఎన్నో సంవత్సరాలకు భక్తకన్నప్ప సినిమా చేయాలని మంచు విష్ణు తన డ్రీమ్ అన్నట్లుగా తెలియజేశారు. తన కుమారుడికి తన వంతు సహాయంగా కూడా అందిస్తూ వస్తూ ఉన్నారు మోహన్ బాబు. సుమారుగా 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇటీవలే జరగబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ సైతం ఉపయోగించినట్లు కనిపిస్తోంది.

ఈ ఏడాది నవంబర్ కి మొదటి కాపీ సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కన్నప్ప సినిమా విషయంపై అటు మంచి విష్ణుని చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. కన్నప్ప సినిమా విషయంపై పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ ట్రైలర్ టీజర్ తో అంచనాలు పెంచేలా చూస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తూ ఉన్నారు. చాలామంది సెలబ్రిటీలను ఇందులో కీలకమైన పాత్రలో తీసుకురావడంతో ఈ సినిమాకి హైట్ పెరుగుతుందని చిత్ర బృందం భావించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: