రోలెక్స్ పాత్రపై సూర్య షాకింగ్ కామెంట్స్...!!

murali krishna
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్. 2022లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది.. అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న కమల్ కు విక్రమ్ సినిమా భారీ ఊరటను ఇచ్చింది.. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలోని పాటలు, కమల్ పాత్ర ఇలా అన్ని ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.ముఖ్యంగా ఈ మూవీ చివరి ఐదు నిమిషాల్లో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది.. ఈ పాత్ర తెరపై చివరి రెండు నిమిషాలు మాత్రమే కనిపించినప్పటికీ. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో ఆ క్యారెక్టర్‌ని పెట్టుకుని సెపరేట్ చేయాలనే డిమాండ్ ప్రేక్షకుల నుంచి వచ్చింది.ఇప్పుడు ఆ సినిమా విషయంపై సూర్య స్పందించాడు.సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కంగువా చిత్రం విడుదలకు సిద్ధం అయింది.. తాజాగా ఈ ప్రమోషన్లలో పాల్గొన్న సూర్యకు ఓ ఇంటర్వ్యూలో రోలెక్స్ పాత్ర గురించి ప్రశ్న ఎదురైంది..రోలెక్స్‌ను మళ్లీ తెరపై చూస్తామా అని యాంకర్ అడగ్గా.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

 'రోలెక్స్ పాత్ర కోసం కేవలం హాఫ్ డే మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నాను. అయితే ఆ హాఫ్ డే కష్టపడితే అభిమానుల నుంచి ఇంత ప్రేమ, మద్దతు లభిస్తుందని అస్సలు ఊహించలేదు.'రోలెక్స్' పాత్రను బేస్ చేసుకుని 'విక్రమ్' దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్టాండ్ ఎలోన్ గురించి నాతో చర్చించారు. ఈ విషయంపై రెండుసార్లు మేము మీట్ అయ్యాం. కానీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు అని సూర్య అన్నారు.నా తరువాత సినిమా 'రోలెక్స్' చేయాలా లేక'ఇరుంబు కై మాయావి' చేయాలా అనేది నిర్ణయించుకోవాలి. 'ఇరుంబు కై మాయావి' చిత్రం చేయి కోల్పోయిన ఓ సూపర్‌హీరో కథ అని సూర్య తెలిపారు.ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకుడు. అయితే ఆ కథ కూడా ఇంకా ఫైనల్ కాలేదని సూర్య తెలిపారు.. లోకేష్ మనసులో ఏముందో తెలీదు రో్లెక్స్ పాత్రపై తాను కాన్ఫిడెంట్ గా వున్నాడు.. త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని సూర్య తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: