"ఎవరు ఏమనుకున్నా సరే..ఆయన నాకు కచ్చితంగా హెల్ప్ చేస్తాడు".. సమంత సెన్సేషనల్ కామెంట్స్..!

Thota Jaya Madhuri
సమంతకి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా మినిస్టర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆమెకు సంబంధించిన విషయాలు ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం. అదే మూమెంట్లో సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన "సిటాడిల్" సిరీస్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది. దీంతో ఆమెకు సంబంధించిన ఒక్కొక్క విషయం బయట పడుతూ వస్తుంది .


తాజాగా సిటాడిల్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఓ విషయాని గుర్తు చేసుకుంది . కన్నీరు కూడా పెట్టుకుంది . సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఆమెకు చాలా చాలా అనారోగ్యం గా ఉండిందట . ఎంతలా అంటే లేచి ఒక షాట్ లో కూడా నడవలేక పోయిందట . నిల్చో లేక పోయిందట.  కళ్ళు బాగా తిరిగేవట . ఆ టైంలో సిటాడిల్ టీం తనకు చాలా చాలా హెల్ప్ చేసిందట . ఇప్పటివరకు ఆమె వర్క్ చేసిన అత్యంత కష్టమైన ప్రాజెక్టులో సిటాడిల్ వెబ్ సిరీస్  ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అని చెప్పుకొచ్చింది .


అంతే కాదు సిటాడిల్ టీం రుణం నేను తీర్చుకోలేను అని ..ఆ టీం నాలో ఎంతో ధైర్యాన్ని నింపింది అని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆమె మాట్లాడుతూ .."జీవితంలో మనం కష్టాలను ఎదుర్కొనే సమయంలో ఆ దేవుడు కచ్చితంగా సహాయం చేస్తూ ఉంటాడు ..ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడడానికి సహాయం చేసిన వారిని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. వారిపై కృతజ్ఞతా భావంతో ఉండాలి. నాకు తెలుసు దేవుడు నాకు ఎప్పుడో ఒకప్పుడు హెల్ప్ చేస్తాడు అని ..దేవుడు నాకు ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంతో సహయాం చేస్తాడు అని .. ఆ దేవుడే నాకు ఇలా ఈ సిటాడిల్ టీంతో హెల్ప్ చేయించాడు. రాజ్ అండ్ డీకే తో పాటు సిటాడిల్ టీం మొత్తం నాకు హెల్ప్ చేసి జాగ్రత్తగా చూసుకున్నింది. కొన్ని కొన్ని సీన్స్ లో నటించేటప్పుడు నా వల్ల కాదు అనిపించేది కానీ టీం సపోర్ట్ తో నటించగలిగాను.. కచ్చితంగా ఈ సిరీస్ మీ అందరికీ నచ్చుతుంది "అంటూ చెప్పుకొచ్చింది. సమంత మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: