రజిని 'వేట్టయాన్‌ రెమ్యూనరేషన్ డీటెయిల్స్ .. ఎవరు ఎంత తీసుకున్నారంటే..!

Amruth kumar
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన వేట్టయాన్‌ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ కలెక్షన్ల తో సత్త చాటుతుంది. డిజె జ్ఞానువేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని తెచ్చుకుంది. అలాగే మూడు దశాబ్దాల తర్వాత ఇద్ద‌రు దిగ్గజ నుటలైన రజినీకాంత్ , అమితాబచ్చన్ ఈ సినిమాలో కలిసిన నటించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మించింది . అలాగే ఈ సినిమాలో రజనీకాంత్ కు జంటగా మంజు వారియర్ నటించగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా కీలకపాత్ర లో నటించారు . అలాగే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సినిమాకు సంగీతం ప్లస్ గా మారింది.

ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్తో తెర్కెక్కించారు. అయితే కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్ తెచ్చుకుంది. ఈ సినిమా కోసం రజనీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యూనిరేషన్ అందుకుంటే .. అమితాబచ్చన్ కేవలం రూ. 7 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. బచ్చన్ కంటే రజిని 17 రేట్లు ఎక్కువ రెమ్యూనిరేషన్ అందుకున్నాడని అంటున్నారు .. ఇద్దరు సూపర్ స్టార్లుగా ఇండస్ట్రీలో రాస్తున్న అయితే రెమ్యూనరేషన్ లో ఇంత వ్యత్యాసం ఉండడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

వేట్టయాన్‌ సినిమాలో చాలామంది స్టార్స్ సన‌టించి మెప్పించారు. మలయాళ స్టార్‌ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రం కోసం రూ. 3కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటే .. మంజు వారియర్ ఆమె పాత్ర కోసం రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే, టాలీవుడ్‌ స్టార్‌ రానా దగ్గుబాటి మాత్రం తన రోల్‌ కోసం రూ.5 కోట్లు ఛార్జ్‌ చేశారట . వేట్టయాన్‌లో తనదైన స్టైల్లో దుమ్మురేపిన రితికా సింగ్ మాత్రం కేవలం రూ. 25 నుంచి 35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: