మరోసారి ఒకే స్టేజిపై బాలయ్య.. బన్నీ.. ఇద్దరు ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ నింపే న్యూస్..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. కెరియర్లో ఎంతో అద్భుతమైన స్థాయికి చేరుకున్న బాలకృష్ణ చాలా సంవత్సరాల పాటు కేవలం సినిమాలపైనే తన ఫోకస్ ని పెట్టాడు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల నుండి తన ఫోకస్ను కాస్త రాజకీయాల వైపు షిఫ్ట్ చేసిన బాలయ్య ఈ మధ్యబికాలంలో ఓ టీ టీ షో లపై కూడా తన ఫోకస్ను పెట్టాడు. అందులో భాగంగా ప్రముఖ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు.

ఇప్పటికే ఈ టాక్ షో కు సంబంధించిన కొన్ని సీజన్లు కూడా కంప్లీట్ అయ్యాయి. అవి అద్భుతమైన స్థాయిలో సక్సెస్ కూడా అయ్యాయి. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ టాక్ షో కు సంబంధించిన కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే ఈ టాక్ షో నెక్స్ట్ సీజన్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకు జరిగిన ఆన్ స్టాపబుల్ సీజన్కి అల్లు అర్జున్ ఒక ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చాడు.

ఇకపోతే మరోసారి కూడా అల్లు అర్జున్ ఆన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అన్ స్టాపబుల్ నెక్స్ట్ సీజన్లో భాగంగా అల్లు అర్జున్ కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ ఈ రోజు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య , బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: