ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ కొత్త స్కెచ్.. ఇక ఆ రికార్డులన్నీ గల్లంతె..!

Amruth kumar
మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఇక ఇప్పటికే రూ.500 కోట్లు పైగా కలెక్షన్లు రాబట్టి ఎన్టీఆర్‌కు సోలో హీరోగా తొలి పాన్ ఇండియా హిట్ తెచ్చిపెట్టింది. ఇలా దేవర సక్సెస్ తో ఎన్టీఆర్ తర్వాత సినిమాలు పైన కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో ఎన్టీఆర్ తొలిసారిగా నటిస్తున్న వార్‌2  కు సంబంధించిన షూటింగ్లో ఇప్పటికే ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అలాగే కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో చేయబోయే తన 31వ సినిమా అని కూడా త్వరలోనే ప్రారంభించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది అని కూడా అంటున్నారు.

 ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన దేవర కు కూడా సిక్వెల్ రాబోతుంది. కానీ ప్రశాంత్ - ఎన్టీఆర్ 31వ‌ సినిమాని మాత్రం సింగిల్ సినిమాగా తెర‌కెక్కిచ‌బోతుంటు తెలుస్తుంది. ఎలాంటి ప్రిక్వల్ గానే సీక్వెల్ కానీ ఉండదట. అయితే ప్రశాంత్ నీల్‌ కేజిఎఫ్ సినిమాని రెండు భాగాలుగా తీశారు. గత సంవత్సరం వచ్చి సూపర్ హిట్ అయిన సలార్‌కు కూడా త్వరలోనే సీక్వెల్ రానుంది. ఇప్పుడు ఎన్టీఆర్ 31 సినిమాను మాత్రం  య‌క్షన్ డ్రామాగా సింగిల్ పార్ట్ లోనే ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారని అంటున్నారు.

అలాగే ఈ సినిమాతో నీల్ సీక్వెల్ ట్రెండ్స్ కు బ్రేక్ ఇచ్చినట్లే అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎన్టీఆర్‌ 31 మూవీకి సంబంధించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణీ వసంత్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను ఖరారు చేశారని, త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే కథతో మూవీ ఉండబోతున్నట్టు మరో వార్త కూడా చక్కర్లు కొట్టింది. మరి వీటిలో నిజమెంతో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: